రూ.100 కోట్లు నష్టం తెచ్చిన పిల్లి.. ఇంతకీ ఏం జరిగింది ?

దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అది పారిశ్రామిక ప్రాంతం కావడంతో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. ఇండస్ట్రియల్‌ ఏరియాలో ..

Update: 2022-03-24 12:42 GMT

పూణె : ఒక పిల్లి చేసిన పనికి మహారాష్ట్రకు రూ.100 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఇంతకీ ఆ పిల్లి ఏం చేసింది ? పిల్లి వల్ల ప్రభుత్వానికి అంతపెద్ద మొత్తంలో ఎలా నష్టం వచ్చింది ? తెలుసుకుందాం. మహారాష్ట్రలోని పూణెలో పింప్రిచించ్ వాడ్ లో జరిగిందీ ఘటన. పిల్లి కారణంగా ఏకంగా 60 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భోసరీ, భోసరీ ఎంఐడీసీ, ఓకుర్ది ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ఆ ప్రాంతాల్లోని ప్రజలంతా అంధకారంతో ఇబ్బందులు పడ్డారు. 7వేల వ్యాపార సముదాయాలకు పవర్‌ కట్‌ అవ్వడంతో.. సుమారు వందకోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చింది.

పింప్రిలోని భోసారి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 220కేవీ సబ్‌ స్టేషన్‌ లో ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కింది ఓ పిల్లి. విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్‌తో ఆ పిల్లి అక్కడే చనిపోయింది. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అది పారిశ్రామిక ప్రాంతం కావడంతో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. ఇండస్ట్రియల్‌ ఏరియాలో పవర్​ కట్​పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు భోసరీ MIDCఎ వ్యాపారులు. ఇది MSEDCLఅధికారుల నిర్వహణ లోపమని, పవర్​ కట్​ ద్వారా తమ వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, సుమారు వంద కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపిస్తోంది పింప్రి-చించ్​వడ్​ స్మాల్‌ కేర్‌ ఇండస్ట్రీస్‌ సంఘం.
ఈ అంశంపై విద్యుత్తు శాఖ మంత్రి ప్రత్యేక దృష్టి సారించి సమస్యను వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. కాగా.. మరో మూడ్రోజులు పవర్​ కట్​ కొనసాగవచ్చంటున్నారు అధికారులు. ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేస్తున్నామని.. ప్రత్యామ్నాయమార్గాల ద్వారా విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు చెప్తున్నారు. ఒకే ట్రాన్స్​ఫార్మర్​పై లోడ్​ మొత్తం పడుతున్నందున ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని MSEDCLఅధికారులు విజ్ఞప్తి చేశారు.


Tags:    

Similar News