ప్రధాని మోడీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు - పీఎంఓ

ప్రధాని మోడీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క సెలవు కూడా తీసుకోలేదని ఓ ఆర్టీఐ (రైట్ టు ఇన్ఫర్మేషన్) ప్రశ్నకు పీఎంఓ (ప్రధానమంత్రి కార్యాలయం) సమాధానం ఇచ్చింది..

Update: 2023-09-06 10:24 GMT

ప్రధాని మోడీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు - పీఎంఓ

ప్రధాని మోడీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క సెలవు కూడా తీసుకోలేదని ఓ ఆర్టీఐ (రైట్ టు ఇన్ఫర్మేషన్) ప్రశ్నకు పీఎంఓ (ప్రధానమంత్రి కార్యాలయం) సమాధానం ఇచ్చింది..

రెండో ప్రశ్నకు సైతం పీఎంఓ రిప్లై ఇచ్చింది. 2014 మేలో మోడీ పీఎంఓలో అడుగుపెట్టారని, అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన పాల్గొన్న ఫంక్షన్ల సంఖ్య (దేశ, విదేశ) 3000ను దాటిందని స్పష్టం చేసింది. గత 20ఏళ్లల్లో ఒక్కసారి కూడా సెలవు తీసుకోలేదని, పనిపై ఆయనకు ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం అని 2019లో జరిగిన ఓ ఈవెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ చాలా చురుకుగా ఉంటారు. ఎన్నికలైనా, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలైనా, ఆయన హాజరవుతారు. సమయం దొరికినప్పుడల్లా ప్రజలను కలిసేందుకు ఇష్టపడుతుంటారు. నూతన పార్లమెంట్ భవనం నిర్మాణ దశలో ఉన్నప్పుడు, షెడ్యూల్లో లేనప్పటికీ అనేక మార్లు అక్కడికి వెళ్లి, కార్మికులను కలిశారన్నారు.

Tags:    

Similar News