విమాన టిక్కెట్లను ఇలా

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్‌ ఏషియా విమానాల్లో ప్రయాణించే వారు ఇకపై ఒకే వెబ్‌సైట్‌ నుంచి టికెట్‌ బుక్ చేసుకునే వీలుంది

Update: 2023-03-29 02:27 GMT

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్‌ ఏషియా విమానాల్లో ప్రయాణించే వారు ఇకపై ఒకే వెబ్‌సైట్‌ నుంచి టికెట్‌ బుకింగ్ చేసుకునే వీలుంది. ఈ మేరకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

వెబ్‌సైట్ నుంచి...
సోమవారం నుంచి ప్రయాణికులకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతేడాది అక్టోబరులో ఎయిర్‌ ఏషియాలో వాటాలను ఎయిరిండియా కొనుగోలు చేసింది. ఈ ఏడాది మొదట్లో రెండు కంపెనీల బాధ్యతలను ఒకే సీఈవో పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో ఒకే వెబ్‌సైట్ నుంచి టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉందని, ప్రయాణికులు ఇది గమనించి బుక్ చేసుకోవాలని కోరింది.


Tags:    

Similar News