Notice Issued: బాలీవుడ్‌ అగ్రనటులకు కేంద్రం షోకాజ్‌ నోటీసులు.. కారణం ఏంటంటే

గుట్కాకు సంబంధించి వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్నారంటూ కోర్టులో దాఖలైన పిటిషన్‌పై ముగ్గురు బాలీవుడ్‌ నటులకు..

Update: 2023-12-10 07:03 GMT

గుట్కాకు సంబంధించి వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్నారంటూ కోర్టులో దాఖలైన పిటిషన్‌పై ముగ్గురు బాలీవుడ్‌ నటులకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. సోకాజ్‌ నోటీసులు అందుకున్న ముగ్గురు షారుక్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవ్‌గణ్‌లు ఉన్నారని అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌కు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు.

ఈ నటులు కొన్ని హనికరమైన ఉత్పత్తులకు సంబంధించి యాడ్స్‌లో పాల్గొనడం తీవ్ర అభ్యంతకరంగా ఉన్నాయంటూ మోతీలాల్‌ యాదవ్‌ అనే న్యాయవాది గతంలో అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. భారత ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు అందుకున్న వారు ఇలాంటి హానికర యాడ్స్‌లో పాల్గొనడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన కోర్టు.. పిటిషనర్‌ అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అప్పట్లో ఆదేశించింది. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొంటూ ఇటీవల పిటిషనర్‌ మరోసారి కోర్టును ఆశ్రయించారు.

ఈ విషయమై స్పందన కోరుతూ కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌బీ పాండే శుక్రవారం కోర్టుకు సమాచారం ఇచ్చారు. షారుక్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవ్‌గణ్‌కు అక్టోబర్‌ 22నే షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని, ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు అమితాబ్‌ బచ్చన్‌ ఇప్పటికే ఈ తరహా ప్రకటనల నుంచి తప్పుకొన్నారని న్యాయస్థానానికి పాండే తెలియజేశారు. అయినప్పటికీ.. ఓ గుట్కా కంపెనీ ఆయన ప్రకటనలను ప్రసారం చేసిందని తెలిపారు. దీంతో అమితాబ్‌ సదరు కంపెనీకి లీగల్‌ నోటీసులు పంపారని చెప్పారు. దీనిపై తదుపరి విచారణను 2024 మే 9కి వాయిదా వేసింది కోర్టు.

Tags:    

Similar News