తమిళనాడులో అత్యంత సంపన్న అభ్యర్థి ఎవరంటే?
తమిళనాడులో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది
తమిళనాడులో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అయితే ఈ నామినేషన్ల సందర్భంగా సమర్పించిన అఫడవిట్ లో అత్యంత సంపన్నురాలిగా ఒక అభ్యర్థి నిలిచింది. తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా లీమారోస్ పోటీ చేస్తున్నారు. ఆమెకు 1,049 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
లాటరీ టిక్కెట్ల విక్రయం ద్వారా...
లాటరీ టికెట్ల విక్రయ సంస్థ అధినేత మార్టిన్ సతీమణి అయిన లీమారోస్ ఇటీవల అన్నాడీఎంకేలో చేరి బరిలోకి దిగారు. నామినేషన్తోపాటు సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను ఆమె వెల్లడించారు. తనకు రూ.139.63 కోట్ల చరాస్తులు, రూ.909.94 కోట్ల స్థిరాస్తులు, రూ.8.57 కోట్ల అప్పులు ఉన్నాయని ఆమె అఫడవిట్ లో తెలిపారు.