ఢిల్లీకి వచ్చే ప్రయాణికులకు అలెర్ట్
ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు ప్రయాణికులకు అలెర్ట్ జారీ చేశారు
ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు ప్రయాణికులకు అలెర్ట్ జారీ చేశారు. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు పలు సూచనలు చేశారు.ఎయిర్పోర్ట్ దగ్గర కుక్కలకు ఆహారం పెట్టొద్దని తాజాగా ఎయిర్ పోర్టు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
వీధికుక్కలకు...
మూడు టెర్మినల్స్ పరిధిలో వీధి కుక్కలకు ప్రత్యేక బృందాలతో ఆహారం పెడుతున్నామని ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఎక్కడపడితే అక్కడ ఫుడ్ వేయడం వల్ల కుక్కల ప్రవర్తన మారుతోందన్న అధికారులు, అలా చేయవద్దని సూచించారు.