తమిళనాడులో ఎన్ఐఏ దాడులు

తమిళనాడులో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. చెన్నై, తిరుచ్చి, మధురై, తేని తో సహా పది జిల్లాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.

Update: 2023-05-09 03:51 GMT

తమిళనాడులో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. చెన్నై, తిరుచ్చి, మధురై, తేని తో సహా పది జిల్లాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తున్నారన్న అందిన సమాచారంతో ఈ సోదాలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింంది. పీఎఫ్ఐ, ఎస్‌డీపీఐ సానుభూతి పరులకు చెందిన ఇళ్లల్లోనూ, వారి కార్యాలయాల్లోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

జమ్మూ కాశ్మీర్‌లోనూ...
జమ్మూ కాశ్మీర్‌లోనూ నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. బృందాలుగా విడిపోయి మొత్తం పన్నెండు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు చేస్తున్నారని తెలిసింది. ఉగ్రవాదులకు ఈ సంస్థల ద్వారా పెద్దయెత్తున ఫండింగ్ జరుగుతుందన్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఎన్ఐఏ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. ఈరోజు తెల్లవారు జామునుంచి సోదాలు జరుగుతున్నాయి.


Tags:    

Similar News