ఫెమీనా మిస్ ఇండియా గా 19 ఏళ్ల రాజస్థాన్ భామ

59వ ఎడిషన్ ఫెమీనా మిస్ ఇండియా ఫైనల్ పోటీలు మణిపూర్ రాజధాని ఇంఫాల్ లోని కుమన్ లంపక్ ఇండోర్ స్టేడియంలో..

Update: 2023-04-16 06:14 GMT

femina miss india 2023

ఫెమీనా మిస్ ఇండియా - 2023 కిరీటాన్ని ఈసారి 19 ఏళ్ల రాజస్థాన్ భామ నందినీ గుప్తా సొంతం చేసుకుంది. 59వ ఎడిషన్ ఫెమీనా మిస్ ఇండియా ఫైనల్ పోటీలు మణిపూర్ రాజధాని ఇంఫాల్ లోని కుమన్ లంపక్ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీల్లో మొత్తం 29 రాష్ట్రాలకు చెందిన అందాల భామలు పాల్గొనగా.. తన అందం, అభియనంతో ఆకట్టుకున్న రాజస్థాన్‌లోని కోటాకు చెందిన నందినీ గుప్తా ఫెమీనా మిస్ ఇండియా విజేతగా నిలిచింది.

ఈ కార్యక్రమానికి కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే వంటి సినీ తారలు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వేడుకలో కార్తీక్, అనన్య వేదికపై డాన్స్ చేసి అలరించారు. గతేడాది మిస్ ఇండియాగా నిలిచిన సినీశెట్టి ఆమెకు కిరీటాన్ని తొడిగారు. రతన్ టాటా, ప్రియాంక చోప్రా వంటి వారు తనను జీవితంలో ఇన్స్పైర్ చేశారని నందినీ తెలిపింది. ఢిల్లీకి చెందిన శ్రేయా పూన్జా, మణిపూర్‌కు చెందిన తౌనోజమ్ స్ట్రెలా లువాంగ్ వరుసగా మొదటి, రెండో రన్నరప్‌గా నిలిచారు.


Tags:    

Similar News