అంత్యక్రియలు నిర్వహించిన 24 గంటల తర్వాత తిరిగొచ్చిన వ్యక్తి !

సత్యమంగళం పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. ఆదివారం రాత్రి మృతదేహానికి..

Update: 2022-04-06 05:02 GMT

చెన్నై : అంత్యక్రియలు నిర్వహించిన 24 గంటల తర్వాత చనిపోయిన వ్యక్తి సజీవంగా ఇంటికి తిరిగి రావడంతో.. కుటుంబ సభ్యులంతా షాకయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని బనగలద్ పూర్ లో జరిగింది. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. మూర్తి (55) రోజువారి కూలీ. చెరకు కోసేందుకు కొన్ని రోజులక్రితం తిరుపూర్ వెళ్లాడు. ఆదివారం సాయంత్రం మూర్తి కుమారుడు కార్తికి బంధువుల నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. మూర్తి ఓ బస్టాప్ లో శవమై కనిపించాడని చెప్పారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కార్తి.. మృతదేహం తన తండ్రిదేనని నిర్థారించాడు.

సత్యమంగళం పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. ఆదివారం రాత్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి, ఖననం చేశారు. కుటుంబ పెద్ద చనిపోయిన విషాదంలో ఉన్న వారంతా.. సోమవారం సాయంత్రం ఇంటికొచ్చిన మూర్తిని చూసి షాకయ్యారు. కుమారుడు కార్తి అయితే షాక్ నుంచి చాలా సేపటి వరకు తేరుకోలేకపోయాడు. తన తండ్రి మరణవార్త విని ఎంత షాక్ అయ్యానో, ఆయన ఇంటికి వచ్చినప్పుడు కూడా అంతే షాక్‌కు గురయ్యానని చెప్పుకొచ్చాడు. అనంతరం ఈ సమాచారాన్ని కార్తి పోలీసులకు చేరవేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పుడు చనిపోయింది ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు.



Tags:    

Similar News