ఇండో - పాక్ సరిహద్దుల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం

పంజాబ్ గురుదాస్ పుర్ లోని చందూ వదాలా పోస్ట్ వద్ద పాక్ స్మగ్లర్లపై బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. వెంటనే స్మగ్లర్లు

Update: 2022-01-28 09:41 GMT

ఇండో - పాక్ సరిహద్దు వద్ద పాక్ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అనవసరంగా రెచ్చగొట్టొద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా.. పాక్ తన వక్రబుద్ధిని ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంది. ఉగ్రమూకల డ్రోన్లపై గురిపెట్టిన భారత భద్రతాదళాలు..సరిహద్దు వెంట డ్రగ్స్ సరఫరాపైనా నిఘా ఉంచారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 5.15 గంటల ప్రాంతంలో భారత్ లోకి అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న పాక్ ముఠాను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.

పంజాబ్ గురుదాస్ పుర్ లోని చందూ వదాలా పోస్ట్ వద్ద పాక్ స్మగ్లర్లపై బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. వెంటనే స్మగ్లర్లు ఎదురు కాల్పులు చేయడంతో.. భద్రతా దళాలు ఆ ముఠాను తరిమికొట్టారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవానుకు గాయాలైనట్లు బీఎస్ఎఫ్ డీఐజీ వెల్లడించారు. స్మగ్లర్ల నుంచి 47 కేజీల హెరాయిన్​తో పాటు.. 7 ప్యాకెట్ల నల్లమందు, 2 మ్యాగజైన్లు ఉన్న చైనీస్​ పిస్టల్​, ఏకే 47 తుపాకులు, పిస్టళ్లు సహా ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు భద్రతా సిబ్బంది.


Tags:    

Similar News