గల్వాన్ లోయలో జెండా ఆవిష్కరించిన భారత సైన్యం

గల్వాన్ లోయలో జెండాను ఆవిష్కరించి రెచ్చగొట్టిన చైనాకు.. మన సైన్యం అంతే ధీటుగా జవాబిచ్చింది. గల్వాన్ వ్యాలీలో

Update: 2022-01-04 09:36 GMT

గల్వాన్ లోయలో జెండాను ఆవిష్కరించి రెచ్చగొట్టిన చైనాకు.. మన సైన్యం అంతే ధీటుగా జవాబిచ్చింది. గల్వాన్ వ్యాలీలో చైనా జెండాను ఆవిష్కరించిన రోజునే.. మన సైన్యం కూడా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నూతన సంవత్సరం మొదటి రోజునే భారత జవాన్లు గల్వాన్ లోయలో మన జాతీయ జెండాను ఎగురవేశారంటూ కామెంట్ పెట్టారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


కాగా.. 2021 డిసెంబర్ 30వ తేదీ రాత్రి అరుణాచల్ స్కాట్స్, అస్సాం రెజిమెంట్ జవాన్లతో కలిసి కిరణ్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్ లోని బోమ్డిలాలోని ఆర్ఆర్ హిల్స్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు సైనికులతో ముచ్చటించారు. మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ పనిచేస్తున్న మన సైన్యం జోష్.. ఎల్లప్పుడూ అత్యున్నతంగానే ఉంటుందని ట్వీట్ చేశారు.



Tags:    

Similar News