బీబీసీ ఆఫీస్‌లో ఐటీ సోదాలు

ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

Update: 2023-02-14 07:38 GMT

ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీపై వివాదాస్పద డాక్యుమెంటరినీ బీబీసీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీబీసీ కార్యాలయంపై ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బంది ఫోన్లను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.

ముంబయిలోనూ...
ఢిల్లీలోనే కాకుండా ముంబయి కార్యాలయంలోనూ ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఆదాయపు పన్నుకు సంబంధించి కొన్ని ఫిర్యాదులు రావడంతోనే తాము సోదాలు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నట్లు తెలిసింది. ఈ తనిఖీల్లో కొన్ని డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలియవచ్చింది. ఉన్నత స్థాయి అధికారులను మాత్రం ఆఫీసులోనే ఉంచి, ఇతర సిబ్బందిని బయటకు పంపించివేసి మరీ తనిఖీలు చేస్తున్నారు.


Tags:    

Similar News