ఢిల్లీలో ఐటీ శాఖ దాడులు.. మళ్లీ ఆప్ నేత టార్గెట్

ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు

Update: 2023-10-10 05:16 GMT

ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఢిల్లీలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. సీబీఐ, ఏసీబీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఐటీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా ఆయన ఉన్న సమయంలో చేపట్టిన నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి.

వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా...
దీంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ రోజు తెల్లవారు జాము నుంచి అమానుల్లాఖాన్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్దయెత్తున అక్కడికి చేరుకున్నారు. ఐటీ శాఖ సోదాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసి అటువైపు ఎవరినీ రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వరసగా ఆప్ కు చెందిన నేతలపై ఐటీ, ఈడీ దాడులతో ఢిల్లీ హోరెత్తిపోతుంది.


Tags:    

Similar News