మూడో రోజు పెరిగిన బంగారం ధర

మూడో రోజు కూడా బంగారం ధరలు దేశంలో పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.250లు పెరిగింది. వెండి ధర కూడా పెరిగింది

Update: 2023-03-18 03:34 GMT

బంగారం ధరలు వరసగా పెరుగుతున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు పెరుగుతున్న బంగారాన్ని కొనుగోలు చేయలేకపోతున్నారు. బంగారం తగ్గితే తక్కువగా పెరిగితే ఎక్కువగా ధరలు పెరుగుతుండటం మనం చూస్తూనే ఉంటాం. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, కేంద్ర బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ పెంచడం, కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులను తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న ధరలలతో కొనుగోళ్లు కొంత మందగిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో మాదిరి వ్యాపారం ఉండటం లేదంటున్నారు. పెట్టుబడి కోసం చూసే వారు సయితం ధరల పెరుగుదల చూసి బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వెనకడగు వేస్తున్నారు.

భారీగా వెండి...
తాజాగా మూడో రోజు కూడా బంగారం ధరలు దేశంలో పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.250లు పెరిగింది. వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర పై ఆరు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 53,800 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,690 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 73,100 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News