డిగ్రీ పరీక్షల్లో ఫెయిల్.. కిడ్నాప్ డ్రామా ఆడిన విద్యార్థిని.. చివరికిలా..

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బీఏ ఫస్టియర్ చదువుతున్న తన 17 ఏళ్ల కుమార్తె

Update: 2023-05-15 06:18 GMT

డిగ్రీ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థిని.. ఆ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే మందలిస్తారని వారిని మభ్యపెట్టేందుకు కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులను పరుగులు పెట్టించింది. చివరికి సీసీటీవీ ఫుటేజీలు ఆమె చెప్పిందంతా కట్టుకథేనని తేల్చి చెప్పాయి. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బీఏ ఫస్టియర్ చదువుతున్న తన 17 ఏళ్ల కుమార్తె కిడ్నాప్ అయిందని, పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత కాలేజీ నుంచి వస్తుండగా ఇండోర్ లోని ఓ ఆలయం వద్ద ఆమెను కొందరు కిడ్నాప్ చేశారని పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు.

ఒక కొత్త నంబరు నుంచి తండ్రికి ఫోన్ చేసిన ఆ విద్యార్థిని.. కాలేజీ ఫ్యాకల్టీ ఒకరు తనను ఆలయ సమీపంలో విడిచి పెట్టారని, ఆ తర్వాత తానొక ఈ-రిక్షా ఎక్కినట్టు తెలిపింది. అనంతరం ఆ డ్రైవర్ ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ముక్కుకు ఓ గుడ్డను వాసన చూపించడంతో స్పృహ కోల్పోయానని పేర్కొంది. ఇదంతా తండ్రి పోలీసులకు తెలుపగా.. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ఆమె చెప్పిందంతా కట్టుకథేనని తేల్చేశారు.
విద్యార్థిని చెప్పిన సమయాన్ని బట్టి.. అదే సమయంలో ఆమె ఉజ్జయినిలోని రెస్టారెంట్ లో ఒంటరిగా కూర్చుని ఉన్న ఫొటోలు లభ్యమయ్యాయి. రెండింటినీ సరిపోల్చిన పోలీసులు ఆ ఇద్దరూ ఒకరేనని తేల్చారు. విద్యార్థినిని ఇండోర్ తీసుకొచ్చి.. ఆమె బ్యాగును తనిఖీ చేయగా ఇండోర్ - ఉజ్జయిని బస్ టికెట్ తో పాటు రెస్టారెంట్ బిల్లు కూడా లభ్యమైంది. పరీక్షల్లో ఫెయిల్ అవడంతో దాని నుంచి తల్లిదండ్రుల దృష్టిని మరల్చేందుకే ఆమె ఈ డ్రామా ఆడినట్లు నిర్థారించారు. విద్యార్థినికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.




Tags:    

Similar News