ఐసీయూలో లతా మంగేష్కర్

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె ఆసుపత్రిలో చేరి చికత్స పొందుతున్నారు.

Update: 2022-01-11 07:26 GMT

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె ఆసుపత్రిలో చేరి చికత్స పొందుతున్నారు. లతా మంగేష్కర్ కు కోవిడ్ పాజిటివ్ తేలడం, వయసు రీత్యా హోం ఐసొలేషన్ లో ఉండటం మంచిది కాదని భావించిన కుటుంబ సభ్యులు ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది.

స్వల్ప లక్షణాలే అయినా...?
అయితే లతామంగేష్కర్ కు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. లతా మంగేష్కర్ ఆరోగ్యం, వయసు దృష్ట్యా ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.


Tags:    

Similar News