నాలుగోసారి ఈడీ సోదాలు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

Update: 2022-10-07 03:54 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్, బెంగళూరు, ముంబయిలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నాలుగోసారి ఈ తనిఖీలను ఈడీ చేస్తుంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో....
ఈడీ అరెస్ట్ చేసిన సమీర్ మహేంద్రో ఇచ్చిన సమాచారం మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్నారని తెలిసింది. హైదరాబాద్ లో ఆరు చోట్ల ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. యూకో బ్యాంకు ద్వారా డబ్బులు సమీర్ మహేంద్రో కొందరికి లిక్కర్ స్కామ్ కు సంబంధించి డబ్బులు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి.


Tags:    

Similar News