బ్రేకింగ్ : సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు

శివసేన నేత సంజయ్ రౌత్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని ఆదేశాలను జారీ చేసింది

Update: 2022-06-27 07:37 GMT

శివసేన నేత సంజయ్ రౌత్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని ఆదేశాలను జారీ చేసింది. ముంబైలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరింది. సంజయ్ రౌత్ శివసేన లో కీలక నేతగా ఉన్నారు. ఆయన సామ్నా పత్రిక బాధ్యతలను కూడా చూస్తున్నారు. భూకుంభకోణం కేసులో సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు జారీ చేసింది.

కీలక నేతగా....
అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ సంక్షోభంలో కూడా శివసేన తరుపున సంజయ్ రౌత్ క్రియాశీలకంగా వ్యవహరస్తున్నారు.అసంతృప్త నేతలపై హార్ష్ కామెంట్స్ చేస్తున్నారు. దమ్ముంటే ముంబయి రావాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వేధింపుల చర్యల్లో భాగంగానే బీజేపీ రౌత్ ను టార్గెట్ చేసిందని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు.


Tags:    

Similar News