నేడు ఉప రాష్ట్రపతి ఎన్నిక

భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం పది గంట లనుంచి సాయంత్రం 5 గంటల వరకూ పార్లమెంటు హాలులో ఈ పోలింగ్ జరగనుంది

Update: 2022-08-06 03:06 GMT

భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం పది గంట లనుంచి సాయంత్రం 5 గంటల వరకూ పార్లమెంటు హాలులో ఈ పోలింగ్ జరగనుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ , విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ ఎన్నికల్లో కేవలం పార్లమెంటు సభ్యులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటారు.

ఆయన వైపే....
లోక్ సభకు చెందిన 545 మంది, రాజ్యసభ సభ్యులు 245 మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ విజయం దాదాపు ఖాయమయినట్లే. ఎందుకంటే మెజారిటీ ఓటర్లు ఎన్డీఏ వైపు ఉండటంతో ఆయన ఎన్నిక దాదాపు ఖాయమైంది. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మాత్రం పాల్గొనడం లేదు. ఎన్నికలకు దూరంగా ఉంటామని మమత బెనర్జీ ప్రకటించింది. ఈరోజు రాత్రికి ఫలితం ప్రకటించనున్నారు.


Tags:    

Similar News