రాహుల్, సోనియాకు హైకోర్టు నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాందీ,రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాందీ,రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు వేసిన పిటిషన్ పై నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలను డిల్లీ హైకోర్టులో ఈడీ సవాలు చేసింది. తదుపరి విచారణ మార్చి 2026కి వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ అధికారుల గతంలో విచారించారు.
ఈడీ పిటీషన్ తో...
ట్రయల్ కోర్టులో ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుకు సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేశారు. కానీ ట్రయల్ కోర్టు ఆ ఛార్జిషీటును తిరస్కరించింది. దీంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైకోర్టును ఆశ్రయించడంతో తీర్పు ఎలా వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సోనియా, రాహుల్ లు ఈ కేసులో నిందితులుగా ఈడీ చేర్చింది.