ఫ్రెషర్స్ పార్టీ.. 182 మందికి కరోనా

కరోనా వైరస్ ముప్పు ఇంకా వీడలేదు. ఫ్రెషర్స్ పార్టీలో 182 మంది విద్యార్థులకు కరోనా సోకింది.

Update: 2021-12-02 03:55 GMT

కరోనా వైరస్ ముప్పు ఇంకా వీడలేదు. ఫ్రెషర్స్ పార్టీలో 182 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఈ ఘటన కర్ణాటక మెడికల్ కళాశాలలో జరిగింది. కర్ణాటకలోని ధార్వాడ మెడికల్ కళాశాలలో విద్యార్థులు ఈ మధ్య ఫ్రెషర్స్ పార్టీ చేసుకున్నారు. కరోనా లక్షణాలు కనపడటంతో కొందరు విద్యార్థులు వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో 300 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 182 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

వారిలోనే ఎక్కువ మందికి....
కర్ణాటకలో ఎస్డీఎమ్ మెడికల్ కాలేజీ ఆఫ్ సైన్సెస్ లో విద్యార్థులు ఫ్రెషర్స్ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో అత్యధిక మంది కరోనా బారిన పడినట్లు సమాచారం. మొత్తం మూడు వేల మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇంకా రిపోర్టులు రావాల్సి ఉంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమయింది.


Tags:    

Similar News