భారత్ లో స్థిరంగా కరోనా

భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులో 10,256 మంది భారత్ లో కరనా బారిన పడ్డారు. 68 మంది మరణించారు

Update: 2022-08-26 04:43 GMT

భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులో 10,256 మంది భారత్ లో కరనా బారిన పడ్డారు. 68 మంది మరణించారు. రికవరీ శాతం 98.61 గా నమోదయిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజులోనే 13,528 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల శాతం 0.20 గా నమోదయింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుంది. ఇపపటి వరకూ దేశ వ్యాప్తంగా 2,11,13,94,639 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు అధికారులు వెల్లడించారు.

తగ్గుతున్న యాక్టివ్ కేసులు...
కోవిడ్ కేసులు తగ్గుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని చెబుతున్నారు. దేశంలో ఇప్పటి వరకూ 4,43,89,176 కరనా కేసులు నమోదయినట్లు తెలిపారు. వీరిలో చికిత్స పొంది 4,37,70,913 కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా కారణంగా 5,27,556 మరణించారు. ప్రస్తుతం దేశంలో 90,707 యాక్టివ్ కేసులున్నాయి.


Tags:    

Similar News