భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,27, 952 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Update: 2022-02-05 04:55 GMT

భారత్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,27, 952 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణా సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈరోజు 1,059 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,02,17,088 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరణాల సంఖ్య.....
ప్రస్తుతం దేశంలో 13,31,569 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,20,52,712 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,01,114 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,69,21,44,432 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.


Tags:    

Similar News