భారత్ లో పెరుగుతున్న మరణాలు.. ఈరోజు ఎన్నంటే?

భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 67,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

Update: 2022-02-08 03:46 GMT

భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 67,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు లక్షకు దిగువన కేసులు నమోదయ్యాయి. ఈరోజు 1,188 మంది మరణించారు. మరణాల సంఖ్య బాగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,08,31,204 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

యాక్టివ్ కేసులు తగ్గుతున్నా.....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 9,94,891 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 6,01,53,712 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,01,233 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,70,81,54,432 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.


Tags:    

Similar News