పిడుగుపాటుకు ఏడుగురి మృతి.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

అదే ప్రాంతానికి చెందిన అన్షిత(11) పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా.. పిడుగు పడటంతో మరణించింది. రాయ్‌బరేలీలోని దిహ్, భదోఖర్..

Update: 2023-07-07 07:26 GMT

lightening strikes in up

ఉత్తరప్రదేశ్ లో వేర్వేరు ప్రాంతాల్లో పడిన పిడుగుల ధాటికి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ కురిసిన వర్షాల్లో.. బుదౌన్, ఇలాహ్, రాయ్ బరేలీ జిల్లాల్లో పిడుగుపాటు ఘటనలు నమోదయ్యాయి. పిడుగుపాటుకు గురై మరణించిన వారిలో ఇద్దరు రైతులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బబ్లూ (30), వర్జిత్ యాదవ్ (32) ఇద్దరు రైతులు ఉషైత్ బజార్ నుంచి బైకుపై ఇంటికి తిరిగి వస్తుండగా.. భారీవర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. దాంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.

అదే ప్రాంతానికి చెందిన అన్షిత(11) పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా.. పిడుగు పడటంతో మరణించింది. రాయ్‌బరేలీలోని దిహ్, భదోఖర్, మిల్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు వ్యక్తులు పిడుగుపాటుకు గురై మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. డిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గెండాలాల్ గ్రామ సమీపంలోని మోహిత్ పాల్ (14) పొలంలో పశువులను మేపుతుండగా పిడుగుపడి అక్కడికక్కడే మరణించాడు. మిల్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని పూర్వ గ్రామంలో జమునప్రసాద్ (38) పొలంలో పనిచేస్తుండగా పిడుగుపాటుకు గురై మరణించాడు. ఎటాహ్ లోని ఖంజర్ పూర్ గ్రామంలో దర్మేంద్ర(32) పశువులను మేపుతుండగా పిడుగుపాటుతో మరణించాడు. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ఏడుగురు మరణించడంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.







Tags:    

Similar News