రేషన్ కార్డుదారులకు నిజమైన పండగే

​కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2026-04-01 05:50 GMT

​కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త అందించింది. ఒకేసారి 3 నెలల ఉచిత బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గోదాముల్లో నిల్వలు పెరగడం, కొత్త పంటకు చోటు కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

నేటి నుంచి...
ఏప్రిల్ వ తేదీ అంటే నేటి నుంచి రేషన్ దుకాణాల్లో మూడు నెలల ఉచిత బియ్యాన్ని పంపిణీ మొదలు కానుంది. అయితే ఒకేసారి వేలి ముద్ర వేసి మూడు నెలల బియ్యం లబ్దిదారులు తీసుకోవచ్చు. మూడు నెలలు బియ్యం ఒకేసారి అందుకోవడం మంచి పరిణామమని లబ్దిదారులు చెబుతున్నారు.


Tags:    

Similar News