Breaking : కరోనాపై కేంద్రం అలర్ట్ : ఆరు రాష్ట్రాలకు వార్నింగ్

కరోనా కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆరు రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది

Update: 2023-03-16 13:42 GMT

కరోనా కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆరు రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. టెస్ట్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్ లు మూడు సత్వరం చేపట్టాలని కోరింది. వ్యాక్సినేషన్ ను కూడా వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నిబంధనలను...
ఈ ఆరు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం పట్ల ఆందోళన కలిగిస్తుందని పేర్కొంది. కరోనా నిబంధనలు ప్రజలు పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసింది.


Tags:    

Similar News