Breaking : కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై పై గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటోలను కలర్ గాపెట్టాలని నిర్ణయించింది

Update: 2025-09-17 11:40 GMT

central election commission

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై పై గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటోలను కలర్ గాపెట్టాలని నిర్ణయించింది. ఓటర్లు సులువుగా గుర్తుతో పాటు పార్టీ అభ్యర్థులను గుర్తు పట్టేలా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని బీహార్ శాసనసభ ఎన్నికల నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.

కలర్ ఫొటోలు...
ఇకపై ఏ శాసనసభ లేదా పార్లమెంటు ఎన్నికల్లోనైనా కలర్ ఫొటోలు ఇక పై ఈవీఎంలో కనిపించేలా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఓటర్ల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఓటర్లకు మరింత వెసులు బాటు కల్పించేలా ఈ నిర్ణయం కలిపించింది. కలర్ ఫొటోల వల్ల 20 ఎంఎం సైజులో ఉండనుంది. గుర్తు 40 ఎంఎం సైజులో ఉండనుంది.


Tags:    

Similar News