ఇక రైల్లో సీసీటీవీలు

ప్రయాణీకుల భద్రతను మెరుగుపరిచే నిర్ణయం తీసుకుంది భారత రైల్వే మంత్రిత్వ శాఖ.

Update: 2025-07-14 10:03 GMT

ప్రయాణీకుల భద్రతను మెరుగుపరిచే నిర్ణయం తీసుకుంది భారత రైల్వే మంత్రిత్వ శాఖ. 74,000 కోచ్‌లలో తలుపుల దగ్గర ఉన్న కామన్ మూవ్‌మెంట్ ఏరియాలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. నార్తర్న్ రైల్వేలోని లోకో ఇంజిన్లు, కోచ్‌లలో విజయవంతమైన సీసీటీవీ కెమెరా ట్రయల్స్ తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది రైల్వే మంత్రిత్వ శాఖ. గంటకు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే రైళ్లలో కూడా మరియు తక్కువ వెలుతురు ఉన్న పరిస్థితుల్లో కూడా అధిక-నాణ్యత గల విజువల్స్ అందుబాటులో ఉండేలా చూడాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే అధికారులను కోరారు. ప్రతి రైలు కోచ్‌కు డోమ్ తరహా నాలుగు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ప్రవేశ మార్గంలో రెండు కెమెరాలు ఉంటాయి. అదేవిధంగా, ప్రతి లోకోమోటివ్‌లో ఆరు సీసీటీవీ కెమెరాలు ఉంటాయి.

Tags:    

Similar News