పసి బిడ్డ కడుపులో మరో పిండం.. వైద్యులే ఆశ్చర్యపోయారు..!

వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు శిశువు పొట్టలో గర్భస్థ శిశువు పెరుగుతోందని నిర్ధారించారు

Update: 2022-05-30 03:11 GMT

కేవలం 40 రోజుల శిశువు కడుపులో పిండం వృద్ధి చెందింది. వైద్య పరంగా అత్యంత అరుదైన ఈ కేసు బిహార్‌లోని మోతిహారిలో వెలుగులోకి వచ్చింది. ఇటివల 40 రోజుల పసికందు పొట్ట ఉబ్బింది. మూత్రవిసర్జన సరిగా చేయలేకపోవడంతో ఆందోళనకు గురయిన తల్లిదండ్రులు బిడ్డను సమీపంలోని రహ్మానియా మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు శిశువు పొట్టలో గర్భస్థ శిశువు పెరుగుతోందని నిర్ధారించారు. కంప్యూటెడ్ టొమోగ్రఫీ(సీటీ) స్కానింగ్ చేయగా ఈ విషయం బయటపడిందని వైద్యులు తెలిపారు. ఇది అత్యంత అరుదైన కేసుగా.. పుట్టుకతో వచ్చే అరుదైన ఈ వ్యాధిని 'పిండంలో పిండం' గా పిలుస్తారని వైద్యులు తెలిపారు. శిశువుకు వైద్యులు చికిత్స నిర్వహించారు. సర్జరీ చేసి పిండాన్ని తొలగించారు. బిడ్డ ఆరోగ్యం నిలకడగానే ఉందని, హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు.

40 రోజుల నవజాత శిశువు కడుపు భాగంలో ఉబ్బి ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు హాస్పిటల్ కు తీసుకెళ్లగా ఈ విషయం బయటపడింది. శిశువును మోతీహారీ రహ్మానియా మెడికల్ సెంటర్‌కు చికిత్స కోసం తీసుకువచ్చారు. బీహార్‌లోని రహ్మానియా మెడికల్ సెంటర్‌కు చెందిన డాక్టర్ తబ్రేజ్ అజీజ్, కడుపు ఉబ్బరం, మూత్రం ఆగిపోవడం వెనుక కారణం కోసం పరీక్షలు జరిపారు. CT స్కాన్ చేయగా అప్పటికే కడుపులో మరొక పిండం ఏర్పడిందని తెలిసింది. ఈ అరుదైన సంఘటనను డాక్టర్ తబ్రేజ్ అజీజ్ న్యూస్ ఏజెన్సీకి వెల్లడించారు. ప్రతి ఐదు లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇటువంటి అరుదైన సందర్భం సంభవిస్తుందని వైద్యులు తెలిపారు. డాక్టర్ అజీజ్ మాట్లాడుతూ, "40 రోజుల పసికందు కడుపులో పిండం అభివృద్ధి చెందడాన్ని గమనించాం.దీనిని ఫీటస్ ఇన్ ఫీటూ అంటారు. శిశువుకు శస్త్రచికిత్స చేశాం. పరిస్థితి నిలకడగానే ఉంది." అని చెప్పుకొచ్చారు. నవజాత శిశువు సర్జరీ అనంతరం పూర్తిగా క్షేమంగా ఉందని, ఆసుపత్రి నుంచి చేశామని డాక్టర్ అజీజ్ తెలిపారు.


Tags:    

Similar News