నేడు జాతీయ సమావేశంలో ప్రధాని ప్రసంగం

భారతీయ జనతా పార్టీ జాతీయ సమావేశాలు నేడు కూడా జరగనున్నాయి. నేడు ప్రధాని ప్రసంగంతో సమావేశాలు ముగియనున్నాయి

Update: 2024-02-18 02:53 GMT

భారతీయ జనతా పార్టీ జాతీయ సమావేశాలు నేడు కూడా జరగనున్నాయి. వరసగా రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలలో అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యనేతలు పాల్గొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాలను సాధించే లక్ష్యంగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే దేశంలో మూడోసారి అధికారంలోకి రావాలన్న టార్గెట్ తో అనుసరించాల్సిన వ్యూహాలపై అన్ని రాష్ట్రాల నేతలతో చర్చించనున్నారు.

నేతలకు దిశానిర్దేశం...
ఈ రోజు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. పార్టీ శ్రేణులకు రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. వివిధ రాష్ట్రాల్లో పొత్తులపై ఈ సమావేశాల తర్వాత స్పష్టత వచ్చే అవకాశముంది. హ్యట్రిక్ విజయం సాధించేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ సమావేశాలను బీజేపీ నిర్వహిస్తుంది. ప్రధాని ప్రసంగంతో ఈ సమావేశాలు ముగియనున్నాయి.


Tags:    

Similar News