తేజ డైరెక్షన్ లో రానా సోలో హీరోగా తెరకెక్కిన 'నేనే రాజు నేనే మంత్రి' హిట్టయ్యి కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టిన 'నేనే రాజు' చిత్రం నిర్మాతలకు లాభాలు పంట పండిస్తోంది. ఈ సినిమా 11 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి... ఇప్పుడు దాదాపు 25 కోట్లు కొల్లగొట్టిందనే టాక్ బయటికి వచ్చింది. ఇప్పటికే ఈ లాభాల్లో వాటా కింద తేజ 5 కోట్లు, రానా 5 కోట్లు, నిర్మాతలు 5 కోట్లు తీసుకున్నట్టు వార్తలు ఉండనే ఉన్నాయి. తేజకి రానాకీ లాభాల్లో వాటా ఎందుకంటే వారిద్దరూ ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈ సినిమా లాభాల్లో 25 పైసల వాటాకి పనిచేశారు... సో అలా వారు చెరో ఐదు కోట్లు తీసుకున్నారు. ఇక 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం పొలిటికల్ సెంటిమెంట్ డ్రామాగా తెరకెక్కి మంచి విజయం సాధించింది. ఇకపోతే ఈ మూవీ.. వినాయకచవితి వీకెండ్తో 25 కోట్ల షేర్ మార్క్ అందుకోనుందని ట్రేడ్ టాక్.
2 వారాల 'నేనే రాజు నేనే మంత్రి' వసూళ్లు ఏరియాల వారీగా:
నైజాం : 7.85 కోట్లు
ఉత్తరాంధ్ర : 2.62 కోట్లు
సీడెడ్ : 2.5 కోట్లు
ఈస్ట్ : 1.70 కోట్లు
గుంటూరు : 1.42 కోట్లు
కృష్ణ : 1.39 కోట్లు
వెస్ట్ : 92 లక్షలు
నెల్లూరు : 55 లక్షలు
టోటల్ నైజాం + ఆంధ్రప్రదేశ్ : 18 కోట్ల 95 లక్షలు
వరల్డ్ వైడ్ : 23 కోట్ల 50 లక్షలు వసూలు చేసి మంచి లాభాలు కొట్టేసింది. అలాగే ఆగష్టు 11 న మరో రెండు చిత్రాలతో పోటీపడి మరీ ఈ 'నేనే రాజు నేనే మంత్రి' ఇంతటి వసూళ్లు సాధించిందని చెబుతున్నారు.