సాధారణంగా హీరో- హీరోకి పోటీ ఉండటం చూస్తాం. మెగా ఫామిలీ నుండి ఇప్పటికే చాలా మంది హీరోస్ టాలీవుడ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వీరి మధ్య పోటీ బాగా ఉంది. అంతమంది వచ్చిన మెగా ఫామిలీ నుండి మెగా ఫాన్స్ అండదండలు వాళ్లపై అలానే ఉంటాయి.దీంతో వాళ్ళ మధ్యే వాళ్ళకే కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది.
వరుణ్ తేజ్ ఫిదా మూవీ బ్లాక్ బస్టర్ అయినా పేరు మొత్తం సాయి పల్లవి ఎకౌంటు లోకి వెళ్లిపోయింది. అందుకు వరుణ్ తేజ్ కూడా హ్యాపీ గా లేడు. మరో సినిమాతో తానేంటో నిరూపించుకోటానికి ట్రై చేస్తున్నాడు. తన తర్వాత వచ్చిన సాయి ధరమ్ తేజ్ మంచి హిట్స్ తో సెటిల్ అయిపోవడం, మాస్ సినిమాలతో 25 కోట్లు ఈజీగా రాబట్టగలిగే రేంజ్ కి చేరుకోవడం వరుణ్ కి ఇబ్బందిగా మారింది.
అందుకే వరుణ్ తేజ్ కెరీర్ కి బూస్ట్ ఇచ్చే ప్రయత్నాలు తెరవెనుక జోరుగా సాగుతున్నాయని టాక్. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ మల్టీ స్టార్రర్ రాబోతుంది. ఇందులో వెంకీతో పాటు మరో కుర్ర హీరోకు సమానమైన పాత్ర ఉంది. దీని కోసం మొదట అనిల్..సాయి ధరం తేజ్ కు అనుకున్నారు. కాని ఇంతలో లెక్కలు మారి సాయి ధరం తేజ్ ప్లేస్ లో వరుణ్ తేజ్ ని రీ ప్లేస్ చేయాల్సిందిగా మెగాస్టార్ నుంచి అనిల్ కు రిక్వెస్ట్ అందిందట. కారణం ఆల్రెడీ సాయికి మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఇది వదిలేసినా నష్టం లేదని, వరుణ్ కి ఒక బలమైన హిట్ కావలసిన తరుణంలో ఇది తనకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పినట్టు టాక్. ఇది ఆల్మోస్ట్ ఒకే అయిపోయిందని ఫిలిం నగర్ టాక్. అయితే ప్రకటన వస్తే తప్ప ఇది నిజమని నమ్మలేం.