డ్రగ్ కేసులో నోటీసులు అందుకుని సిట్ ముందు విచారణకు హాజరవుతున్నారు. ముందుగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ సిట్ ముందుకు హాజరయ్యాడు. తర్వాతి రోజు శ్యామ్ కె నాయుడు హాజరు కాగా ఆ తర్వాత వరుసగా సుబ్బరాజు మిగతా వారు తమ తమ డేట్స్ లో సిట్ ముందు హాజరు కావాల్సి వుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఈ డ్రగ్ కేసు మంచి హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఇక ఈ కేసు మొత్తం పూరి చుట్టూనే అల్లుకుని ఉండడంతో అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. అదేమిటంటే ఈ డ్రగ్ కేసులో ఎక్కువగా లింక్ ఉన్నది హీరోయిన్ ఛార్మికి అంటున్నారు.
ఇది అన్నది కూడా పూరి భార్య లావణ్యనే అంటున్నారు. ఛార్మి తో ఫ్రెండ్ షిప్ వల్లనే పూరి ఇలా అయ్యాడని లావణ్య తన సన్నిహితుల వద్ద చెప్పుకుందని అంటున్నారు. ఛార్మి, పూరి దగ్గరికి వచ్చాకే పూరి కి మనీ ప్రొబ్లెమ్స్ వచ్చాయని.... అలాగే పూరి తీసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయని ఆవేదన చెందుతూ వారికి తన గోడు వెళ్లబోసుకుంటుందట.
ఛార్మి కూడా హీరోయిన్ అవకాశాలు పోయాక పూరితో కలిసి వ్యాపారం స్టార్ట్ చేసింది. ఇక ఆ వ్యాపారానికి మొత్తం పెట్టుబడి పూరీనే పెట్టాడంటున్నారు. ఇక పూరి వ్యాపారాలకు ఛార్మిని ఎండీని చేసాడని....లావణ్య వాపోతుంది. మరి నిజంగా పూరి వైఫ్ లావణ్య అన్నదని చెబుతున్న విషయాలను సిట్ అధికారులు సీరియస్ గా తీసుకుంటే ఛార్మి కి జైలు ఊచలు లెక్కెట్టడం ఖాయమంటున్నారు.