20 సంవత్సరాలకే తనువు చాలించిన నటి తునీషా శర్మ

Update: 2022-12-24 14:58 GMT

ప్రముఖ టీవీ సీరియల్ నటి తునీషా శర్మ (20) శనివారం ఆత్మహత్య చేసుకుంది. టీవీ సీరియల్ సెట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తునీషా శర్మ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. తునీషా శర్మ చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ను ప్రారంభించింది. 'భారత్ క వీర్ పుత్ర మహారాణా ప్రతాప్' సీనియల్లో తొలిసారి నటించింది. ప్రస్తుతం సోనీ సబ్ టీవీలో 'అలీ బాబా : దస్తాన్-ఎ-కాబూల్'లో కీలక పాత్రను పోషిస్తున్నది. ఈ సీరియల్లో షహజాది మరియమ్ పాత్రలో నటిస్తున్నది. ఫితూర్, బార్ బార్ దేఖో, కహానీ 2: దుర్గా రాణి సింగ్, దబాంగ్-3 చిత్రాలలో కూడా కనిపించింది. ఫితూర్, బార్ బార్ దేఖోలో, తనీషా కత్రినా కైఫ్.. టీనేజ్ పాత్రను పోషించింది. మంచి భవిష్యత్తు ఉన్న బాల నటి ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.


Tags:    

Similar News