టాలీవుడ్ లో మరో విషాదం

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటులు విద్యాసాగర్ రాజు

Update: 2022-08-28 13:11 GMT

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటులు విద్యాసాగర్ రాజు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. విద్యాసాగర్ రాజు కొన్నాళ్ల కిందట పక్షవాతానికి గురయ్యారు. ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశారు. ఆ తర్వాత విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణించారు. విద్యాసాగర్ రాజు తన కెరీర్ లో 100కి పైగా చిత్రాల్లో నటించారు. సీనియర్ నటి రత్నా సాగర్ భర్త విద్యా సాగర్. నాటక రంగం నుంచి వెండితెరపై అడుగుపెట్టిన విద్యా సాగర్ పలు క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్లారు. 'ఈ చదువులు మాకొద్దు' అనే అభ్యుదయ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించారు. మాయలోడు, రాజేంద్రుడు-గజేంద్రుడు, అహ నా పెళ్లంట, స్వాతిముత్యం, ఆఖరి క్షణం వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న సమయంలో ఆయన పక్షవాతానికి గురయ్యారు. ఒక కాలు, ఒక చేయి పడిపోవడంతో వీల్ చైర్ కే పరిమితమయ్యారు. అప్పటికీ పలు సినిమాల్లో, సీరియల్స్ లో నటిస్తూ వచ్చారు. విద్యాసాగర్ కు ఇద్దరు ఆడపిల్లలు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. విద్యాసాగర్ అంత్యక్రియలు సోమవారం మన్సిలాల్ పేట స్మశానంలో జరగన్నాయి.


Tags:    

Similar News