సీఎంకు కృతజ్ఞతలు చెప్పిన సూపర్ స్టార్

కొత్త జీవో, సవరించిన టిక్కెట్ రేట్ల ద్వారా మా సమస్యలను విని వాటిని పరిష్కరించినందుకు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ..

Update: 2022-03-09 06:52 GMT

హైదరాబాద్ : ఏపీలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం కొత్త జీఓ జారీ చేసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, ప్రభాస్, మహేష్ లతో పాటు దర్శకుడు రాజమౌళి, అలీ తదితరులు సీఎం జగన్ తో సమావేశమై సినిమా టికెట్ల రేట్ల పెంపుపై, చిత్రపరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. త్వరలోనే సినిమా టికెట్ల రేట్లపెంపుపై నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ తెలిపారు. చెప్పినట్లుగానే సినిమా టికెట్ల ధరలను పెంచుతూ జీఓ విడుదల చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ కు చిరంజీవి, ప్రభాస్ లు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. "కొత్త జీవో, సవరించిన టిక్కెట్ రేట్ల ద్వారా మా సమస్యలను విని వాటిని పరిష్కరించినందుకు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పేర్ని నాని గారు రాబోయే రోజుల్లో ప్రభుత్వం మధ్య పరస్పర బలమైన, ఆరోగ్యకరమైన సపోర్ట్ కోసం మేము ఎదురు చూస్తున్నాం" అని పేర్కొన్నారు. సినిమా టికెట్ల రేట్ల పెంపుతో.. ఇక పెద్దహీరోల సినిమాల విడుదలకు అడ్డంకులు తొలగిపోయినట్లు. ఎల్లుండి రాధేశ్యామ్ విడుదలవుతుండగా.. 25న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. పాన్ ఇండియా సినిమాలు విడుదలలకు ముందు జగన్ ఈ నిర్ణయం తీసుకోవడంపై టాలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తోంది.

Tags:    

Similar News