పెళ్లి రూమర్స్ పై సాయి పల్లవి సీరియస్ ట్వీట్..

తనకి పెళ్లి అయ్యిపోయింది అంటూ వస్తున్న రూమర్స్ పై, వైరల్ అవుతున్న ఫోటో పై సాయి పల్లవి సీరియస్ ట్వీట్.

Update: 2023-09-22 11:28 GMT

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గురించి సపరేట్ గా చెప్పనవసరం లేదు. తన యాక్టింగ్ తో, స్క్రిప్ట్ సెలక్షన్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కాగా గత కొన్ని రోజులుగా నెట్టింట సాయి పల్లవికి సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతూ ఉంది. ఆ ఫొటోలో సాయి పల్లవి మరియు తమిళ దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామి మేడలో పూలదండలతో కనిపిస్తున్నారు. ఆ ఫోటోని షేర్ చేస్తూ.. పల్లవి, ఆ దర్శకుడిని పెళ్లి చేసుకుంది అంటూ వార్తలు పుట్టిస్తూ వస్తున్నారు.

అయితే అవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. సాయి పల్లవి రీసెంట్ గా తమిళంలో ఒక సినిమా ఒకే చేసింది. కమల్ హాసన్ నిర్మాణంలో శివ కార్తికేయన్ హీరోగా ఆ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి దర్శకుడే రాజ్‌కుమార్‌ పెరియస్వామి. ఆ మూవీ ఓపెనింగ్ పూజా సమయంలో.. చిత్ర యూనిట్ అంతటికి మేడలో పూలదండలు వేశారు. అయితే దానిని సాయి పల్లవి, దర్శకుడు వరకు క్రాప్ చేసి రూమర్లు పుట్టిస్తున్నారు. ఈ విషయం పై ఇటీవల ‘విరాటపర్వం’ దర్శకుడు వేణు ఊడుగుల రియాక్ట్ అవుతూ క్లారిటీ ఇచ్చాడు.

అది మూవీ ఓపెనింగ్ సమయంలో దిగిన ఫోటో, రూమర్లు వ్యాప్తి చేయకండి అంటూ వెల్లడించాడు. తాజాగా ఈ విషయం పై సాయి పల్లవి రియాక్ట్ అవుతూ సీరియస్ ట్వీట్ వేసింది. ఇలాంటి రూమర్స్ తను అసలు పట్టించుకోను అని, కానీ వాటి వల్ల ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇబ్బంది పడితే మాత్రం చూస్తూ ఉండలేను అంటూ చెప్పుకొచ్చింది. అది ఒక సినిమా పూజా కార్యక్రమంలోని ఫోటో అని, కావాలనే కొంతమంది డబ్బులు ఇచ్చి రూమర్లు పుట్టిస్తున్నారంటూ సాయి పల్లవి పేర్కొంది. ఇప్పటికైనా ఇలాంటి పనులు ఆపండి అంటూ చెబుతూ సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా సాయి పల్లవి ఇటీవల తెలుగులో కూడా ఒక మూవీ ఒకే చేసింది. నాగచైతన్య సరసన NC23 మూవీలో నటించబోతుంది. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కబోతుంది. అల్లు అరవింద్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది.

Tags:    

Similar News