సలార్ విషయంలో ప్రశాంత్ నీల్ జాగ్రత్త.. ఏ విషయంలో తెలుసా..?

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్'

Update: 2023-08-20 06:36 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్'. ఈ మూవీ పై పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలే నెలకొన్నాయి. శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), జగపతిబాబు విలన్స్ గా కనిపించబోతున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 'Ceasefire' సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది.

ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ప్రశాంత్ నీల్ ఒక విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడట. ఈక్రమంలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని ఒక సేఫ్ ప్లేస్ కి చేంజ్ చేసినట్లు సమాచారం. ఇంతకీ ప్రశాంత్ నీల్ జాగ్రత్త ఏ విషయంలో..? సలార్ మూవీ షూటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి సెట్స్ నుంచి ఫోటో, వీడియో.. ఇలా ఏదోకటి లీక్ అవుతూనే వచ్చాయి. అయితే పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో మాత్రం అలాంటివి ఏమీ జరగకుండా చూసుకుంటున్నాడట.

అందుకనే ఎడిటింగ్ రూమ్ ని ఒక సేఫ్ ప్లేస్ కి మార్చినట్టు సమాచారం. మూవీ ఫైనల్ అవుట్ ఫుట్ నుంచి ట్రైలర్ కట్ వరకు ఏ చిన్న విషయం బయటకి వెళ్లకూడదని చిత్ర యూనిట్ కి రూల్ పాస్ చేశాడట. దీంతో ఎడిటింగ్ రూమ్ లోకి కేవలం అనుమతి ఉన్నవారికి మాత్రమే ఎంట్రీ ఇస్తున్నారట. గతంలో బాహుబలి 2 విషయంలో కూడా రాజమౌళి ఇలాంటి జాగ్రత్తలే తీసుకున్నాడు. కాగా సలార్ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతోగానో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ లో మూవీ పై ఓ రేంజ్ అంచనాలను క్రియేట్ చేసింది. మరి ట్రైలర్ తో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి. ఈ వారంలోనే ట్రైలర్ గురించి అప్డేట్ రానున్నట్లు సమాచారం. 250 కోట్ల భారీ బడ్జెట్ తో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.

Tags:    

Similar News