Prabhas : 'యానిమల్' ట్రైలర్ పై ప్రభాస్ రివ్యూ.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్..

'యానిమల్' మూవీ ట్రైలర్ పై ప్రభాస్ ఇచ్చిన రివ్యూ చూశారా..?

Update: 2023-11-23 13:12 GMT

'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ వంగా బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ తో తెరకెక్కిస్తున్న చిత్రం 'యానిమల్'. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం అండర్ వరల్డ్ నేపథ్యంలో ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కింది. డిసెంబర్ 1న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సాంగ్స్, టీజర్ అండ్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

సందీప్ వంగా తన గత ఇంటర్వ్యూల్లో.. అసలైన వైలెన్స్ అంటే ఏంటో యానిమల్ మూవీతో చూపిస్తానంటూ చెప్పుకొచ్చారు. ఇక అప్పుడు సందీప్ చెప్పినదానికంటే ఈ మూవీలో ఎక్కువే ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. యాటిట్యూడ్‌కి, అండర్ వరల్డ్ డ్రామా సినిమాలకు ఈ చిత్రం మరో కొత్త డెఫినిషన్ కాబోతుందని అర్ధమవుతుంది. ఇక ఈరోజు మధ్యాహ్నం రిలీజ్ అయిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.
Full View
ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు థ్రిల్ ఫీల్ అవుతున్నారు. మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నామంటూ సోషల్ మీడియాలో ట్రైలర్ పై తమ రివ్యూలను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన రివ్యూని అభిమానులతో పంచుకున్నారు. ప్రభాస్ తన ఇన్‌స్టా స్టోరీలో యానిమల్ ట్రైలర్ ని షేర్ చేస్తూ.. "ట్రైలర్ అదిరిపోయింది. మెంటల్ మాస్ అంతే. ఈ మూవీ చూడడానికి నేనెంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. మూవీ టీంకి నా అభినందనలు" అంటూ రాసుకొచ్చారు.

ఇక ఈ పోస్టు చూసిన అభిమానులు.. సందీప్ వంగతో ప్రభాస్ సినిమా గురించి ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరి కలయికలో 'స్పిరిట్' అనే మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ మూవీని త్వరగా పట్టాలెక్కించండి అంటూ సోషల్ మీడియా ద్వారా రెబల్ అభిమానులు కోరుతున్నారు. కాగా ప్రభాస్ ప్రెజెంట్ సలార్, కల్కి, రాజా డీలక్స్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తి అయిన తరువాతే స్పిరిట్ పట్టాలు ఎక్కనుందని తెలుస్తుంది.


Tags:    

Similar News