ప్రభాస్ అభిమానులు అనుకుంది ఒకటి.. టీజర్ లో చూపించింది మరొకటి..!

ప్రభాస్ అభిమానులే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆది పురుష్'.

Update: 2022-10-02 14:10 GMT

ప్రభాస్ అభిమానులే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆది పురుష్'. ఈరోజు అయోధ్యలో ఎంతో గ్రాండ్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బాహుబలి తర్వాత ప్రపంచవ్యాప్తంగా భారీ స్టార్డమ్ సంపాదించుకున్న తెలుగు సూపర్ స్టార్ ప్రభాస్, ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఆదిపురుష్ టీజర్‌ను ఆవిష్కరించాడు. ప్రభాస్, నటి కృతి సనన్, నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు ఓం రౌత్‌లతో కలిసి ఈ కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొన్నాడు. ఆదిపురుష్ జనవరి 12, 2023న విడుదల కానుంది.

ఈ సినిమా టీజర్ కోసం ఎదురుచూసిన అభిమానులకు కాస్త నిరాశనే కలిగింది. భారీ స్థాయిలో గ్రాఫిక్స్ ఉంటాయని.. అద్భుతంగా ఉంటుందని ఆశించిన అభిమానులకు టీజర్ నిరాశ కలిగించే విధంగా ఉంది. రాముడి పాత్రలో ప్రభాస్ బాగానే కనిపిస్తూ ఉన్నా.. మిగతా పాత్రలు, జీవులకు సంబంధించి యానిమేషన్ పాళ్లు ఎక్కువగా ఉన్నాయని స్పష్టంగా అర్థం అవుతోంది. తానాజీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఓం రౌత్.. ఈ సినిమా షూటింగ్ ను చాలా తక్కువ రోజుల్లోనే పూర్తీ చేసేయడంతో అభిమానుల్లో ఓ రకమైన అనుమానాలు కూడా కలిగాయి. ఇప్పుడు టీజర్ చూసిన కొందరు ఇది అటు యానిమేషన్ కాదు.. ఇటు లైవ్ యాక్షన్ మూవీ కాదని పెదవి విరుస్తూ ఉన్నారు.


Full View


Tags:    

Similar News