కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ పై కేసు నమోదు

రాజస్థాన్ లోని గ్రామ ప్రజల ఫిర్యాదు మేరకు పోలీసులు కత్రినా - విక్కీ కౌశల్ లపై కేసు నమోదు చేశారు

Update: 2021-12-07 07:14 GMT

కొద్ది సంవత్సరాలుగా ప్రేమలో మునిగి తేలుతున్న బాలీవుడ్ ప్రేమజంట కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ లు పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ వారమే వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. వీరి పెళ్లికి రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో గల సిక్స్ సెన్సెస్ కోట వేదికగా మారనున్న సంగతి విధితమే. అయితే.. ఈ జంట తమ పెళ్లి కోసమై ఓ మార్గాన్ని మూసివేశారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు.. కత్రినా జంటకు షాకిచ్చారు.

రోడ్డు మూసివేయడంతో....
రాజస్థాన్ లో చౌత్ మాత మందిర్ ఎంతో ప్రఖ్యాతిగాంచింది. నిత్యం భక్తులతో ఆ మందిరం రద్దీగా ఉంటుంది. అయితే వీరి పెళ్లి నేపథ్యంలో మందిర్ కు వెళ్లే రోడ్డును ఈవెంట్ నిర్వాహకులు మూసేశారు. దీంతో స్థానికులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎవరో పెళ్లి కోసం గుడికి వెళ్లే దారిని మూసివేయడం ఎంత వరకూ న్యాయమని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కత్రినా - విక్కీ కౌశల్ లపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై స్పందించిన ఈవెంట్ నిర్వాహకులు.. కత్రినా - విక్కీ కౌశల్ ల వివాహం ఎన్నో భద్రతా నియమాల మధ్య జరుగుతుండటంతోనే.. ఆ దారిని మూసివేసినట్లు చెప్పారు.


Tags:    

Similar News