బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే..

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 మొదలైపోయింది. ఉల్టా-పల్టా అంటూ మొదలైన ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ వీరే..

Update: 2023-09-04 05:24 GMT

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 కోసం అభిమానులంతా ఎంత ఆసక్తిగా ఎదురు చూశారు. ఈసారి హోస్ట్ ఏమన్నా మారతారా..? కంటెస్టెంట్స్ గా ఎవరు రాబోతున్నారు..? ఇలా ప్రేక్షకుల్లో ఉన్న ప్రశ్నలు అన్నిటికి నిన్నటితో జవాబులు దొరికేశాయి. గత నాలుగు సీజన్ల గా హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్న నాగార్జునే (Nagarjuna) ఈ సీజన్ ని కూడా హోస్ట్ చేయబోతున్నాడు. ఇక కంటెస్టెంట్స్ గా మొత్తం 14 మంది ప్లేయర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

వీరిలో దాదాపు చాలామంది ఆడియన్స్ కి పరిచయం ఉన్నవారే. మొదటి కంటెస్టెంట్ గా 'ప్రియాంక జైన్' హౌస్ లోకి అడుగు పెట్టింది. ప్రముఖ తెలుగు టీవీ ఛానల్స్ లో పలు సూపర్ హిట్ సీరియల్స్ నటించి తెలుగు వారికి బాగా దగ్గరయిన అమ్మాయి. ఇప్పుడు మరింత దగ్గర అవ్వడానికి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
సెకండ్ హౌస్‌మెట్ గా టాలీవుడ్ హీరో శివాజీ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు. ఒక్కప్పుడు సినిమాలతో ఆడియన్స్ ని అలరించిన శివాజీ.. ప్రస్తుతం రాజకీయాల్లో ఎక్కువుగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు సడన్ గా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక మూడో హౌస్ మెంబెర్ గా సింగర్ దామిని ఎంట్రీ ఇచ్చింది. ‘పచ్చబొట్టేసిన’ సాంగ్ తో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న దామిని.. ఇప్పుడు బిగ్ బాస్ ఆడియన్స్ ని తన గాత్రంతో అలరించబోతుంది.

నాలుగో కంటెస్టెంట్‌గా మోడల్ అయిన 'ప్రిన్స్ యావర్' ఎంట్రీ ఇచ్చాడు. మోడలింగ్‌ రంగంలో మంచి ఫేమ్ ఉన్న ఇతను తెలుగు వారికి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. మరి తన ఆటతో ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. ఐదో హౌస్‌మెట్ గా యాక్టర్ కమ్ లాయర్ 'శుభశ్రీ' అడుగు పెట్టింది. మరి తన తెలివితో టైటిల్ ని గెలుచుకుంటుందేమో చూడాలి.

ఒకప్పుడు బోల్డ్ క్యారెక్టర్లతో సౌత్ సినీ పరిశ్రమని ఒక ఊపు ఊపిన 'షకీలా' ఆరో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. షకీలా గతంలో కన్నడ బిగ్‌బాస్ షోలో కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చినా టైటిల్ గెలవలేకపోయింది. మరి ఈసారైనా విన్నర్ గా నిలుస్తుందా? లేదా? చూడాలి. ఇక తన డాన్స్ లతో డాన్స్ లవర్స్ ని అలరిస్తూ వచ్చిన 'ఆట సందీప్'.. ఏడో కంటెస్టెంట్‌గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ ఆడియన్స్ ని అలరించబోతున్నాడు. 

కార్తీకదీపం సీరియల్ లో 'మోనిత'గా అందరికి తెలిసిన 'శోభాషెట్టి'.. ఎనిమిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. మోనితగా ఇన్నాళ్లు తెలు ఆడియన్స్ మనసు బాధపెట్టిన శోభాశెట్టి.. బిగ్‌బాస్ తో అందరి మనసుని గెలుచుకోగలదేమో చూడాలి. ఫుడ్ వ్లాగర్ గా యూట్యూబ్‌ వీడియోలతో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న 'టేస్టీ తేజ' తొమ్మిదో కంటెస్టెంట్‌గా పరిచయం అయ్యాడు. హౌస్ లో ఇతని వల్ల కామెడీ పార్ట్ ని ఆశించవచ్చు.

పదో కంటెస్టెంట్‌గా తెలుగు యాక్ట్రెస్ 'రతిక రోజ్' ఇచ్చింది. ఇన్నాళ్ల పలు చిత్రాల్లో నటించినా సరైన గుర్తింపు రాకపోవడంతో.. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా ఆ ఫేమ్ కోసం ట్రై చేస్తుంది. పదకొండో కంటెస్టెంట్‌గా గౌతమ్ కృష్ణ పరిచయం అయ్యాడు. ‘ఆకాశవీధుల్లో’ అనే మూవీలో నటించిన గౌతమ్ నటుడు మాత్రమే కాదు డాక్టర్ కూడా.

 తెలుగుతో పాటు సౌత్ టు నార్త్ పలు భాషల్లో నటించిన యాక్ట్రెస్ 'కిరణ్ రాథోడ్' పన్నెండో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. కొన్నాళ్ల నుంచి సినిమాల్లో కనిపించని ఈ నటి ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ ప్రత్యెక్షమైంది. ఇక యూట్యూబ్ లో వ్యవసాయం వీడియోలతో ఫేమస్ అయిన 'పల్లవి ప్రశాంత్'.. ఈ బిగ్ బాస్ లోకి పదమూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు.

పద్నాలుగో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు 'అమర్ దీప్' హౌసులోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు పలు సూపర్ హిట్ సీరియల్స్ తో అమర్ తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్నాడు. ఇప్పుడు బిగ్ బోస్ లో ఏం చేస్తాడో చూడాలి. ప్రస్తుతానికి ఈ పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి ఉల్టా-పల్టా అంటూ గేమ్ ని కొత్తగా స్టార్ట్ చేశారు. ఈక్రమంలోనే మొదటిగా ఈ 14 మందితో షో నడిపి తరువాత వైల్డ్ కార్డుతో మరికొంతమంది కంటెస్టెంట్స్ ని తీసుకు వస్తారని తెలుస్తుంది.

 

Tags:    

Similar News