కొనసాగుతున్న ఐటీ సోదాలు

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతూనే ఉన్నాయి. గత 19 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు

Update: 2023-04-20 03:57 GMT

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతూనే ఉన్నాయి. గత 19 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్దయెత్తున విదేశీ నిధులు జమ అయ్యాయన్న సమాచారంతో ఈ తనిఖీలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

మైత్రీ మూవీస్ సంస్థ...
నిన్న పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయంలోనూ నిర్మాతల ఇళ్లలోనూ సోదాలు మొదలయ్యాయి. దాదాపు ఐదు వందల కోట్ల విదేశీ నిధులు వచ్చాయన్న సమాచారంతో ఈ సోదాలు జరుపుతున్నారు. ఈరోజు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో టాలివుడ్‌లో కలకలం రేగింది.


Tags:    

Similar News