పెళ్లా.. తిరుపతిలోనే చేసుకుంటాను: ప్రభాస్

Update: 2023-06-07 01:37 GMT

ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ ఈవెంట్ లో ప్రభాస్ చాలా ఎక్కువసేపు మాట్లాడాడు. ఆదిపురుష్ సినిమా చేయడం మా అదృష్టంగా భావిస్తున్నానని ప్రభాస్ చెప్పుకొచ్చారు. ట్రైలర్ మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. నేను ఒకసారి మా ఫ్యాన్స్ కు 3డీలో వేసి చూపించమన్నాను. మీ అందరికీ నచ్చింది అంటే ఓపెనింగ్ కలక్షన్స్ అదిరిపోతాయి. ఓం రౌత్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తిండి, నిద్ర, కుటుంబం మొత్తం వదిలేసి ఏడు నెలలు శ్రమించాడు. సినిమా కోసం టీమ్‌ మొత్తం రోజుకు దాదాపు 20 గంటలు కష్టపడ్డారని ప్రభాస్ తెలిపారు. ఓం రావత్‌ ఓ యుద్ధమే చేశాడు.. నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు.. ఆదిపురుష్‌ చేయడం మా అదృష్టం. కృతి సనన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక దేవ్ దత్ ను చూస్తుంటే నాకు నిజంగా ఆంజనేయస్వామిని చూస్తున్నట్టుగానే అనిపించింది. నన్ను ఎక్కువసేపు మాట్లాడమని అడుగుతున్నారు. తక్కువ మాట్లాడతాను .. ఎక్కువ సినిమాలు చేస్తాను. ఇందాకటి నుంచి పెళ్లి .. పెళ్లి అని అరుస్తున్నారు. ఎప్పటికైనా తిరుపతిలోనే చేసుకుంటాను అని అన్నారు ప్రభాస్.

“ఒకసారి చిరంజీవిగారు క‌లిసి రామాయణం చేస్తున్నావా అని న‌న్ను అడిగారు. ఆయ‌న ప్ర‌శ్న‌కు అవున‌ని స‌మాధానం చెప్పాను. ఈ అదృష్టం అంద‌రికి దొర‌క‌దు. నీకు దొరికింద‌ని చిరంజీవిగారు నాతో అన్నార‌ని” ప్ర‌భాస్ చెప్పుకొచ్చారు. ఆదిపురుష్ ఆరంభంలో చాలా క‌ష్టాలు ప‌డ్డాం. వాటిని ఎదురించ‌డానికి ఓంరౌత్ టీమ్ పెద్ద పోరాట‌మే చేసింద‌ని ప్ర‌భాస్ చెప్పాడు. సీత పాత్ర‌లో కృతిస‌న‌న్ అద్భుతంగా న‌టించింద‌ని ప్ర‌భాస్ అన్నారు. నిద్ర లేకుండా పని చేశారు ప్రతి ఒక్కరూ అని చెప్పుకొచ్చారు ప్రభాస్. ఓం సినిమా కోసం ఎంతో ఫైట్ చేశారని అన్నారు. వారికి తాను హ్యాట్సాఫ్ చెబుతున్నానని అన్నారు.


Tags:    

Similar News