బిగ్ బాస్ ఓటీటీ: విన్నర్ బిందు మాధవి ఎందుకు స్పెషల్ అంటే..!

తెలుగు బిగ్ బాస్ ఓటీటీ తొలి సీజ‌న్ విన్న‌ర్‌గా హీరోయిన్ బిందు మాధవి నిలిచింది.

Update: 2022-05-22 06:41 GMT

తెలుగు బిగ్ బాస్ ఓటీటీ తొలి సీజ‌న్ విన్న‌ర్‌గా హీరోయిన్ బిందు మాధవి నిలిచింది. శ‌నివారం రాత్రి జ‌రిగిన ఫైనల్ షోలో బిందు మాధ‌విని షో వ్యాఖ్యాత నాగార్జున అక్కినేని విన్న‌ర్‌గా ప్ర‌క‌టించారు. బిగ్ బాస్ ఐదో సీజ‌న్‌లో ఆక‌ట్టుకున్న అఖిల్ సార్థ‌క్ రన్నరప్ గా నిలిచారు. బిగ్ బాస్ తెలుగు వెర్ష‌న్‌లో ఓ మ‌హిళ బిగ్ బాస్ విన్న‌ర్‌గా నిల‌వ‌డం ఇదే తొలిసారి. టైటిల్ రేసులోకి వ‌చ్చిన అఖిల్ సార్ధ‌క్ కంటే బిందు మాధ‌వికే ఎక్కువ ఓట్లు పడ్డాయి. అఖిల్‌కు తెలుగు ప్రేక్ష‌కుల నుంచే మ‌ద్ద‌తు రాగా... బిందు మాధ‌వికి మాత్రం తెలుగుతో పాటు త‌మిళ అభిమానుల నుంచి కూడా భారీ ఎత్తున మ‌ద్ద‌తు ల‌భించింది. బిగ్‏బాస్ ఓటీటీ కి శనివారం గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. తెలుగమ్మాయి బిందుమాధవి ప్రతి టాస్కులలోనూ.. సందర్భంలోనూ ఎదుటివారికి గట్టి పోటీనిస్తూ చివరకు ధైర్యంగా పోరాడింది. బిగ్‏బాస్ టైటిల్ గెలిచి.. రూ. 40 లక్షలు సొంతం చేసుకుంది బిందు మాధవి. బిగ్‏బాస్ టైటిల్ గెలివాలని పోరాడిన అఖిల్ ఆశలు మరోసారి ఆవిరైపోయాయి..ఈసారి కూడా బిగ్‏బాస్ నాన్ స్టాప్ రన్నరప్‏గా నిలిచాడు.

చివరకు 7 కంటెస్టెంట్స్ మిగిలగా.. బిందుమాధవి మొదటి స్థానంలో, అఖిల్ రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.. అనిల్ రాథోడ్, మిత్రాశర్మ ముందుగానే ఎలిమినేట్ కాగా.. అనంతరం బాబా భాస్కర్ ఎలిమినేట్ అయ్యారు. అరియానా రూ. 10 లక్షలు తీసుకుని బయటకు వచ్చేసింది. ఆ తర్వాత యాంకర్ శివ ఎలిమినేట్ అయిన తర్వాత బిందుమాధవి, అఖిల్ ఇద్దరూ బిగ్‏బాస్ స్టేజ్ పైకీ చేరుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు… తెలుగు సినిమాల్లో మళ్లీ నటించేందుకు బిగ్‏బాస్ షోకు వచ్చినట్లు తెలిపింది బిందుమాధవి. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ బిగ్‌ రియాల్టీ షోకు శనివారం (మే 20) శుభం కార్డు పలికారు.


Tags:    

Similar News