ప‌విత్రా లోకేశ్‌ పై చెప్పుతో దాడి చేయడానికి వచ్చిన రమ్య.. విజిల్ వేసిన న‌రేశ్

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు న‌రేశ్‌, ప‌విత్రా లోకేశ్‌ల‌కు మైసూరులో ఊహించని ఘ‌ట‌న ఎదురైంది. వీరిద్ద‌రూ క‌లిసి వెళుతుండ‌గా..

Update: 2022-07-03 07:01 GMT

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు న‌రేశ్‌, ప‌విత్రా లోకేశ్‌ల‌కు మైసూరులో ఊహించని ఘ‌ట‌న ఎదురైంది. వీరిద్ద‌రూ క‌లిసి వెళుతుండ‌గా.. వీరిపై న‌రేశ్ భార్య రమ్య దాడి చేసేందుకు య‌త్నించింది. ప‌విత్రా లోకేశ్‌పై ఏకంగా చెప్పు తీసుకుని ఆమె దాడి చేసేందుకు య‌త్నించింది. న‌రేశ్, ప‌విత్రా లోకేశ్‌ల‌కు సెక్యూరిటీగా వ‌చ్చిన పోలీసులు ర‌మ్య‌ను అడ్డుకున్నారు. త‌మ‌పై దాడి చేసేందుకు య‌త్నించిన ర‌మ్య‌ను మ‌రింత‌గా ఉడికించేందుకు న‌రేశ్ యత్నించాడు. ర‌మ్య‌ను చూసి విజిల్ వేస్తూ ఆయ‌న వెళ్లిపోయాడు. చేయి ఊపుతూ, ర‌మ్య గురించి కామెంట్ చేస్తూ వెళ్లిపోయాడు. త‌న భ‌ర్త‌ను త‌న‌కు ద‌క్క‌కుండా ప‌విత్రా లోకేశ్ చేస్తోంద‌ని.. త‌న‌కు విడాకులు ఇవ్వ‌కుండానే న‌రేశ్... ప‌విత్రా లోకేశ్‌ను ఎలా పెళ్లి చేసుకుంటారంటూ కూడా ర‌మ్య ప్ర‌శ్నిస్తోంది. న‌రేశ్‌కు మూడో భార్య‌. ర‌మ్య‌తో చాలా కాలంగా దూరంగానే ఉంటున్న న‌రేశ్... తాజాగా ప‌విత్రా లోకేశ్‌తో స‌న్నిహితంగా ఉంటున్నారు.

త‌మ మ‌ధ్య స్నేహం మాత్ర‌మే ఉందని అంటున్నారు. న‌రేశ్‌కు ఆత్మీయ తోడు అవ‌స‌ర‌మ‌ని, కొంత‌కాలంగా అత‌డికి మానసికంగా అండ‌గా నిలుస్తున్నాన‌ని పవిత్ర లోకేష్ ప్ర‌క‌టించింది. రమ్య తమని అనవసరంగా బ్యాడ్ చేస్తోందని పవిత్ర లోకేష్ తెలిపింది. నరేశ్ గారు ఎవరు, ఆయన ఫ్యామిలీ ఏంటి అనేది అందరికి తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటూ తమ రిలేషన్ పై దాటవేసింది. కానీ రమ్య ఇక్కడ బెంగుళూరుకి వచ్చి మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. నేను వాళ్ళిద్దరి బంధానికి అడ్డుగా ఉన్నానని.. నేను నరేష్ ,పెళ్లి చేసుకున్నాం అని మీడియాకు చెప్పింది. ఆమె చేసిన ఆరోపణలు నా మనసుకి బాధ కలిగించాయని తెలిపింది. రమ్య గారు ఆమెకి భర్త కావాలని ఉన్నప్పుడు హైదరాబాద్ లోనే మాట్లాడాలి. ఇది ఫ్యామిలీ మ్యాటర్. నరేష్ గారు తెలుగులో ఫేమస్ యాక్టర్. ఇక్కడ కర్ణాటకు వచ్చి ఆమె ఎందుకు మాట్లాడుతోంది. ఫ్యామిలీ పెద్దలు ఉన్నారు. వాళ్ళ ముందు తేల్చుకోవాలి అని పవిత్ర లోకేష్ సూచించారు.


Tags:    

Similar News