South Africa : చర్చికి వెళుతుండగా.. లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి

దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక బస్సు లోయలో పడి నలభై ఐదు మంది మరణించారు

Update: 2024-03-29 01:59 GMT

దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక బస్సు లోయలో పడి నలభై ఐదు మంది మరణించారు. దీంతో ఈస్టర్ పండగ వేళ విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళులున్న బస్సు వంతెన పై నుంచి లోయలో పడటంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి ఎనిమిదేళ్ల బాలిక బయటపడటం విశేషం. బాలిక తప్ప బస్సులో ఉన్న అందరూ మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈస్టర్ పండగ కోసం చర్చికి వెళుతుండగా 165 అడుగుల లోతులో ఈ ఘటన జరిగింది. సహాయక చర్యలు తక్షణమే ప్రారంభించినా ఎవరినీ కాపాడలేకపోయారు.

46 మంది ప్రయాణిస్తుండగా...
నలభై ఆరు మంది ప్రయాణికులతో బోట్స్‌వానా నుంచి మోరియాకు బయలుదేరిన బస్సు మలపు వద్ద లయలో పడింది. బస్సు డ్రైవర్ తో పాటు అందరూ చనిపోయారు. ఈ ప్రమాదం నుంచి ఒక బాలిక బయటపడగా ఆ బాలిక పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈస్టర్ వీకెండ్ లో వంతెనపై ట్రాఫిక్ ఉంటుందని, జియాన్ చర్చికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఇంకా సహాయక చర్యలు వెంటనే చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. బోట్స్‌వానా, దక్షిణాఫ్రికా అధ్యక్షులు మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు.


Tags:    

Similar News