ఆప్ఘనిస్తాన్ : ఆర్మీలోకి సూసైడ్ బాంబర్లు

నాలుగు నెలల క్రితం ఆప్ఘాన్ లో ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్.. తమ శత్రువైన ఇస్మామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్

Update: 2022-01-06 11:26 GMT

ఆప్ఘనిస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్లు రాజ్యమేలుతున్న విషయం తెలిసిందే. నాలుగు నెలల క్రితం ఆప్ఘాన్ లో ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్.. తమ శత్రువైన ఇస్మామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) నుంచి ఎదురయ్యే అతిపెద్ద భద్రతా ముప్పును ఎదుర్కొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా అక్కడి తాలిబన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. బాంబులు పేల్చి మారణ హోమాన్ని సృష్టించే సూసైడ్ బాంబర్లను ఆర్మీలోకి అధికారికంగా రిక్రూట్ చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాలిబన్ల తాజా నిర్ణయంతో ఇకపై.. అక్కడి ఆర్మీలో సూసైడ్ బాంబర్లు కూడా భాగం కానున్నారు.


Tags:    

Similar News