కోహినూర్ పై కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్ రాజవంశం

బ్రిటన్ యువరాజుగా చార్లెస్ 3 పట్టాభిషేకం మరో మూడు నెలల్లో జరగబోతోంది. ఈ నేపథ్యంలో కోహినూర్ వజ్రాన్ని..

Update: 2023-02-15 11:39 GMT

kohinoor diamond

బ్రిటన్ కు కాబోయే రాజు కోహినూర్ వజ్రాన్ని ధరించడంపై బ్రిటన్ రాజవంశం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ యువరాజుగా చార్లెస్ 3 పట్టాభిషేకం మరో మూడు నెలల్లో జరగబోతోంది. ఈ నేపథ్యంలో కోహినూర్ వజ్రాన్ని చార్లెస్-3 ధరించకూడదని రాజవంశం నిర్ణయించింది. కోహినూర్ కి బదులు క్వీన్ మేరీ ధరించిన మరో కిరీటాన్ని కెమిల్లా ధరించనున్నారు. ఈ కిరీటంలో క్వీన్ ఎలిజబెత్2కి చెందిన నగలను పొదగనున్నారు.

పట్టాభిషేకం సమయంలో రాణి కెమిల్లా కిరీటధారణ కార్యక్రమంలో ఈ వజ్రాన్ని ధరించాలని తొలుత భావించినా.. చివరకు ఆ ఆలోచనను పక్కనపెట్టారు. భారత్ తో దౌత్యపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే రాణి కెమిల్లా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా.. క్వీన్ ఎలిజబెత్ 2 కిరీటంలో కోహినూర్ వజ్రం ఉండేది. ఆమె మరణించేంతవరకూ.. అంటే దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఆమె కిరీటంలో కోహినూర్ వజ్రం ఉంది.



Tags:    

Similar News